Social News XYZ     

L7 Movie team at Tirumala

సేవా కార్యక్రమాల్లో 'ఎల్‌7' టీమ్‌

L7 Movie team at Tirumala

రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. ముకుంద్‌ పాండే దర్శకుడు. బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం టీమ్‌ అంతా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పలు కాలేజ్‌లను సందర్శించి బ్లడ్‌ క్యాంపులను నిర్వహించారు. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ ''శుక్రవారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నాం. తర్వాత తిరుమల, తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపు, బ్లడ్‌ డొనేషన్‌ కార్యక్రమాలను నిర్వహించాం. శనివారం హైదరాబాద్‌, వైజాగ్‌ ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులను నిర్వహిస్తాం. ఇక సినిమా విషయానికొస్తే... లవ్‌, కామెడీ, హారర్‌ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఏడు కోణాల్ని చూపించే ప్రయత్నం చేశాం. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వచ్చింది. పాటలు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: నాగసాయి, సమర్పణ: మాస్టర్‌ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌, కో.ప్రొడ్యూసర్‌: బి.మోహనరావు, సతీష్‌ కొట్టె.

 

Facebook Comments

%d bloggers like this: