Social News XYZ     

MY3 Arts Production No 1 movie a crime thriller launched

మైత్రి ఆర్ట్స్ బ్యానర్ లో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రారంభం !!!

మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ గా తెరకెక్కబోతున్న సినిమా ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజ్ తాళ్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నటుడు అలీ, నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకులు వైవిఎస్. చౌదరి, వేణు ఉడుగుల, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవంలో సుచిరిండియా కిరణ్ క్లాప్ కొట్టగా, దర్శకులు వేణు ఉడుగుల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి వైవిఎస్ చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు.

 

క్రైం కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో హీరో వెంకట్ ,హీరో రవిందర్ రెడ్డి, ఆదిత్య, మహేష్ విట్ట, వెంకట్, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ నటిస్తున్నారు. త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకులు రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ...
మంచి కాన్సెప్ట్ తో అందరికి నచ్చే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 10నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు ప్రవీణ్ రెడ్డి గారు వాసుదేవగార్ల సహకారం మారువలేనిని అన్నారు. చిత్ర షూటింగ్ మొత్తం హైదరాబాద్, గోవా, ముంబాయి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది అన్నారు.

నిర్మాత ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ...
దర్శకులు రాజ్ తాళ్లూరి గారు మంచి స్క్రిప్ట్ చెప్పారు. ఈ కథ నచ్చి వెంటనే సినిమా చేద్దాం అని చెప్పాను. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని నమ్మకం ఉంది. అందరికి నచ్చే సినిమాతో మీ ముందుకు వస్తున్నాము అన్నారు.

నటీనటులు:
హీరో వెంకట్ ,రవిందర్ రెడ్డి, శ్రీహరి, ఆదిత్య, మహేష్ విట్ట, వేద్విక, చాందిని రావ్, శుభశ్రీ

నిర్మాత: ప్రవీణ్ రెడ్డి, వాసుదేవరావ్,
దర్శకుడు: రాజ్ తాళ్లూరి
కెమెరామెన్: సన్నీ

Facebook Comments
MY3 Arts Production No 1 movie a crime thriller launched

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

%d bloggers like this: