Social News XYZ     

Rudraksha Puram Movie Will Improve My Stature: Young Hero Mani Saiteja

‘రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది: యువ హీరో మణి సాయితేజ

‘రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది అన్నారు యువకెరటం హీరో మణి సాయితేజ. మాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కొండ్రసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటిస్తున్న తనకు చాలా మంచి పాత్ర లభించిందని, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మణి సాయితేజ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్.కె. గాంధీగారి దర్శకత్వంలో ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఇంతకుముందు ‘బ్యాట్ లవర్స్’ మూవీలో హీరోగా చేశాను. ఆ చిత్రంతో అందరికీ పరిచయమైన నేను.. ఇప్పుడు చేస్తున్న ‘రుద్రాక్షపురం’ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్రకి నన్ను సెలక్ట్ చేసినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పాత్ర నా స్థాయిని పెంచే చిత్రమే కాకుండా.. నా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్రగా ఉంటుంది. ఈ సినిమా విడుదల తర్వాత నా పాత్రకే కాదు.. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నా పాత్రను దర్శకుడు చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా తర్వాత ‘మరోచైత్రం’ అనే చిత్రంలో హీరోగా నటించబోతున్నాను. ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. అందులో కూడా నాది ఛాలెంజింగ్ రోల్. ఈ పాత్రలతో హీరోగా నాకు మంచి పేరు వస్తుందని ఎంతగానో నమ్ముతున్నాను. దర్శకుడు ఆర్.కె. గాంధీగారికి, నిర్మాత ఉపేందర్ గారికి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. థ్యాంక్యూ..’’ అని తెలిపారు.

 

Facebook Comments

%d bloggers like this: