గత ఆదివారం జరిగిన నా ప్రెస్ మీట్లో గౌరవనీయులు యం.పి గారు అయిన రేవంత్ రెడ్డి గారిని వ్వక్తిగతంగా , రాజకీయంగా విమర్శించానని, అలాగే ఘాటు వ్యాఖ్యలు చేసానని వార్తలు వచ్చాయి ...అలాగే రేవంత్ రెడ్డి పై పోసాని ఫైర్ , రేవంత రెడ్డి పై పోసాని ఘాటు కామెంట్స్ అని సోషల్ మీడియాలోనూ , యూ ట్యూబ్ చానల్స్లోనూ విపరీతంగా ట్రోల్ అవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది..అది చూసి నేను ఎంతో భాదపడ్డాను ..అలాగే ఈ విషయం మీద యం.పి రేవంత్ రెడ్డి గారు ,ఆయన సన్నిహితులు ,ఆయన అభిమానులు మనస్తాపం చెందారని తెలిసింది.
నాకు తెలసి గానీ ,తెలియక గానీ నా లైఫ్ లో యం.పి రేవంత్ రెడ్డిగారి ని వ్వక్తిగతంగా గానీ , రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్ చేయలేదు ...మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా నేను తప్పుగా మాట్లడ లేదు.
ఎప్పుడైనా ప్రెస్మీట్ లో ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు, విమర్శతో పాటు సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుంది ..అలా ఉంటే అది జనం కూడా నమ్ముతారు..జనం గుండెల్లోకి కూడా మీ వార్త చేరుతుంది. అలా అయితే ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మాట్లాడానే తప్ప..నేను ఎవరిగురించి తప్పుగా మాట్లాడలేదు.
మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి నేను అసలు మాడ్లడలేదు , ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ..అయినా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో బాగా ట్రోల్ అవుతున్నాయి కాబట్టి , ఇది నాబాధ్యత గా తీసుకొని రేవంత్ రెడ్డి కి , ఆయన అభిమానులకు విచారం వ్వక్తం చేస్తున్నాను ..ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును రెక్టిఫై చేసుకుంటాను
ఇట్లు
పోసాని కృష్ణమురళి నటుడు ,రచయిత