లాక్ డౌన్ వంటి క్లిష్ట పరిస్థితిలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు కోమర వెంకటేష్, psn దొర, మనం సైతం కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Facebook Comments