వ్యవసాయం చాలాసార్లు... రైతన్నలకు తీరని వేదన మిగులుస్తోంది. కష్టపడి పండించి... అనేక సవాళ్లకు ఎదురొడ్డి నిలబడి... పంట చేతికి దక్కించుకున్న... ఫలితం మాత్రం కనిపించటంలేదు. సరైన మార్కెటింగ్ కిటుకులు తెలియక... ఆధునిక పద్ధతులు అందిపుచ్చులేక అనేక ఇబ్బందులు పడుతున్నారు...అన్నదాతలు. మరి రైతన్నలకు లాభాలు రావాలంటే ? పండించిన ఉత్పత్తులకు
సాంకేతిక పరిజ్ఞానంతో అదనపు విలువ జోడించాలి. ఈ విజ్ఞానం రైతులకు అందుబాటులో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ లేకపోయినా, వినియోగదారులను ఆకర్షించే వాణిజ్య విలువలు లేకపోయినా చివరకు మిగిలేది నష్టమే. అందుకే కోత అనంతర పరిజ్ఞానం, విలువ జోడింపుపై నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది ఓ ఉద్యాన కళాశాల. వ్యవసాయాన్నిఫలసాయం చేస్తోంది.
సేంద్రియ ఉత్పత్తులకు నేడు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అలాంటి స్వచ్ఛమైన వ్యవసాయ ఉత్పత్తులను సరైన విధంగా మలిచి మార్కెటింగ్ చేస్తే... లాభాల పంట పండించొచ్చు. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఈ విధంగా వ్యాపారాలు చేస్తూ మార్కెట్లో నిలదొక్కుకున్నా.. రైతులకు మాత్రం ఆ ఫలాలు అందటం లేదు. ఈ కళాశాల మాత్రం...రసాయనాల్లేని సౌందర్య ఉత్పత్తులు, ఆహార పదార్థాలు తయారు చేస్తూ.. రైతన్నలకు కొత్త ఆదాయ మార్గాలు చూపుతోంది. వారే ప్రత్యక్షంగా ఫుడ్ ప్రాసెసంగ్ చేసేలా.. కుటీర పరిశ్రమలను ప్రొత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నదాతలకు అండగా నిలబడతామంటున్నారు.
#IdiSangathi
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
వ్యవసాయం చాలాసార్లు... రైతన్నలకు తీరని వేదన మిగులుస్తోంది. కష్టపడి పండించి... అనేక సవాళ్లకు ఎదురొడ్డి నిలబడి... పంట చేతికి దక్కించుకున్న... ఫలితం మాత్రం కనిపించటంలేదు. సరైన మార్కెటింగ్ కిటుకులు తెలియక... ఆధునిక పద్ధతులు అందిపుచ్చులేక అనేక ఇబ్బందులు పడుతున్నారు...అన్నదాతలు. మరి రైతన్నలకు లాభాలు రావాలంటే ? పండించిన ఉత్పత్తులకు సాంకేతిక పరిజ్ఞానంతో అదనపు విలువ జోడించాలి. ఈ విజ్ఞానం రైతులకు అందుబాటులో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ప్రాసెసింగ్ చేసిన ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ లేకపోయినా, వినియోగదారులను ఆకర్షించే వాణిజ్య విలువలు లేకపోయినా చివరకు మిగిలేది నష్టమే. అందుకే కోత అనంతర పరిజ్ఞానం, విలువ జోడింపుపై నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది ఓ ఉద్యాన కళాశాల. వ్యవసాయాన్నిఫలసాయం చేస్తోంది. సేంద్రియ ఉత్పత్తులకు నేడు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అలాంటి స్వచ్ఛమైన వ్యవసాయ ఉత్పత్తులను సరైన విధంగా మలిచి మార్కెటింగ్ చేస్తే... లాభాల పంట పండించొచ్చు. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఈ విధంగా వ్యాపారాలు చేస్తూ మార్కెట్లో నిలదొక్కుకున్నా.. రైతులకు మాత్రం ఆ ఫలాలు అందటం లేదు. ఈ కళాశాల మాత్రం...రసాయనాల్లేని సౌందర్య ఉత్పత్తులు, ఆహార పదార్థాలు తయారు చేస్తూ.. రైతన్నలకు కొత్త ఆదాయ మార్గాలు చూపుతోంది. వారే ప్రత్యక్షంగా ఫుడ్ ప్రాసెసంగ్ చేసేలా.. కుటీర పరిశ్రమలను ప్రొత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నదాతలకు అండగా నిలబడతామంటున్నారు. #IdiSangathi
