Social News XYZ     

Sri Satya Sai Arts K.K Radha Mohan ventures into Malayalam

మలయాళ రంగంలోకి శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌

Sri Satya Sai Arts K.K Radha Mohan ventures into Malayalam

ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్‌ టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మలయాళంలో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. తన మిత్రులతో కలిసి మలయాళంలో 'కళ్యాణం' పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభిస్తున్నారు. ప్రముఖ మలయాళ హీరో ముఖేష్‌ తనయుడు శ్రావణ్‌ ముఖేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజీవ్‌ నాయర్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 16న త్రివేండ్రంలోని మస్కట్‌ హోటల్‌లో ఉదయం 10 గంటలకు 'కళ్యాణం' చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభోత్సవానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

 

ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహన్‌ తెలియజేస్తూ - ''రాజీవ్‌ నాయర్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందరూ మెచ్చే మంచి సినిమా అవుతుందన్న నమ్మకం కలిగింది. అందుకే ఈ చిత్రంతో మలయాళ రంగంలో అడుగు పెడుతున్నాను. హీరో ముఖేష్‌గారి అబ్బాయి శ్రావణ్‌ ముఖేష్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాము. వర్ష హీరోయిన్‌గా నటిస్తుంది'' అంటూ ''నితిన్‌ హీరోగా మా బేనర్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నితిన్‌ సినిమా పూర్తి వివరాలు తెలియజేస్తాము'' అన్నారు.

శ్రావణ్‌ ముఖేష్‌, వర్ష జంటగా నటిస్తున్న 'కళ్యాణం' చిత్రానికి నిర్మాత: కె.కె.రాధామోహన్‌, దర్శకత్వం: రాజీవ్‌ నాయర్‌.

Facebook Comments
Sri Satya Sai Arts K.K Radha Mohan ventures into Malayalam

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: