Social News XYZ     

‘Adavi lo Last Bus’ to release on May 27th

27న `అడ‌విలో లాస్ట్ బ‌స్‌` విడుద‌ల‌

'Adavi lo Last Bus' to release on May 27th

లంబ‌సింగి నుంచి అర‌కు వెళ్లే ఆఖ‌రి బ‌స్సులో ఏం జ‌రిగింద‌నే నేప‌థ్యంతో తెర‌కెక్కిన చిత్రం అడ‌విలో లాస్ట్ బ‌స్‌. శ్రీ మంజునాథ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది.  పూజ‌శ్రీ స‌మ‌ర్పిస్తున్నారు. ఎస్‌.డి. అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆయ‌నే బాణీల‌ను కూడా స‌మ‌కూర్చారు. అవినాష్‌, న‌ర‌సింహ‌రాజు, మేఘ‌శ్రీ, ప్ర‌కాశ్‌, మాన‌స జోషి, రాజేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుద‌ల కానుంది. చిత్ర విశేషాల గురించి స‌మర్ప‌కురాలు పూజ‌శ్రీ మాట్లాడుతూ

సైక‌లాజిక‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా క‌న్న‌డ‌లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. లంబ‌సింగి  నుంచి అర‌కు వెళ్లే ఆఖ‌రి బ‌స్సులో ఏం జ‌రిగింద‌నే నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం. సూప‌ర్ కాన్సెప్ట్ తో ఉంటుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా అనిపిస్తుంది. ఇందులో రెండు పాట‌లున్నాయి. తొలిసారి బీబీసీలో ఈ సినిమా పాట ప్ర‌ద‌ర్శిత‌మైంది. రెండు పాట‌ల‌ను తెలుగులో రాకేందుమౌళి వెన్నెల‌కంటి రాశారు. నందు తుర్ల‌పాటి రాసిన సంభాష‌ణ‌లు హైలైట్ అవుతాయి. డ‌బ్బింగ్‌తో పాటు అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ నెల 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని చెప్పారు.

 

ఈ చిత్రానికి కెమెరా: అనంత అర‌సు, మాట‌లు: న‌ందు తుర్ల‌పాటి, పాట‌లు:  రాకేందుమౌళి వెన్నెల‌కంటి, ద‌ర్శ‌క‌త్వం, సంగీతం: ఎస్‌.డి.అర‌వింద్‌, స‌మ‌ర్ప‌ణ‌:  పూజ‌శ్రీ, నిర్మాణం:  శ్రీ మంజునాథ మూవీ మేక‌ర్స్.

Facebook Comments

%d bloggers like this: