Dookudu girl in Maharshi

మహేష్ బాబు సినిమాలో మరో హీరోయిన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమాలో టైటిల్ సాంగ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది ఉత్తరాది ముద్దుగుమ్మ మీనాక్షి దీక్షిత్. ఈ మరోసారి మహేష్ బాబు సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమాలో మీనాక్షి ఒక ప్రేత్యేక పాత్రలో కనిపించబోతోందని సమాచారం..

అల్లరి నరేశ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ చిత్రం అధికభాగం వ్యవసాయం గురించి ఉండనుందని సమాచారం. మోడ్రన్ ఫార్మింగ్ గురించి ఈ మూవీలో దర్శకుడు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Facebook Comments
Share

This website uses cookies.