Nagarjuna appreciates a song sung by MM Keeravani for 2.0 movie

‘2.ఓ’లో కీరవాణి పాడిన పాటకు ఫిదా అయిన కింగ్ నాగార్జున

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.ఓ’. ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.వి.ఆర్. సినిమాస్ ద్వారా ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘బుల్లిగువ్వా..’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్‌గా ఉందంటూ ప్రశంసించారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.