AP CM Chandrababu Naidu Will Be Chief Guest For SV Ranga Rao’s Centenary Birthday Celebrations

ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాల ...ఆహ్వానాన్ని అందుకున్న "మా".

అలనాటి విశ్వనాథచక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి శత జయంతిఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జులై 2018 న ఆయన స్వస్థలం అయిన ఏలూరు లో ఎం ఎల్ ఏ బడేటి కోట రామ రావు( బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు... ఈ కార్య క్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయిడు గారు ముఖ్య అతిథి గా విచ్చేయనున్నారు... ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏలూరు ఎం ఎల్ ఏ బడేటి బుజ్జి మరియు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ అంబికా కృష్ణ లు మా అస్సోసియేషన్ సభ్యులను ఆహ్వానించడానికి శనివారం ఉదయం 'మా'కార్యాలయానికి విచ్చేసారు... ఈ సందర్బంగా ఎస్వీ రంగారావు గారి సత్తా జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వీకరించిన' మా' అసోసియేషన్ సభ్యులు' మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, పరచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ, నాగినీడు, సంతోషం పత్రికా అధినేత, నిర్మాత సురేష్ కొండేటిలు ఎం ఎల్ ఏ బడేటి బుజ్జి గారిని మరియు అంబికా కృష్ణ గారిని గౌరవపూర్వకంగా సన్మానించారు...

Facebook Comments

About uma

Share

This website uses cookies.