Matti Manushula “Santha” movie launched

మట్టిమనుషుల  "సంత" మొదలైంది.

సూర్య భరత్ చంద్ర , శ్రావ్యా రావు జంటగా  శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు.

ఓ సంత నేపధ్యంలొ  ప్రేమకథగా ఫీల్ గుడ్ ఎంటర్ టైన్ మెంట్ జొనర్ లొ తెరకెక్కుతొన్న ఈ సినిమా వరంగల్ లొని చిలుపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లొ ప్రారంభమైంది. తొలిషాట్ కు పసునూరి దయాకర్ క్లాప్ నివ్వగా , ఎంఎల్.ఎ రాజయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు.  నిర్మాత శ్రీ జై వర్దన్  మాట్లాడుతూ.. గ్రామీణ నైపధ్యంలో నడిచె ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా సంత తెరకెక్కనుంది. మా‌ టీమ్ అందరికీ మంచి పేరును తీసుకువస్తుందన్నారు

కిన్నెర, మధుమణి, తాగిబొతు రమేష్ ,రఘు కారుమంచి, ప్రసన్న, సాదయ్య, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎస్.కె.అనీఫ్, పసునూరి రవీందర్, పాటలు : గోరెటీ వెంకన్న,కాసర్ల శ్యామ్,మౌనశ్రీ మల్లిక్, డిఓపి: ఫణీంద్ర వర్మ అల్లూరి, నిర్మాత : శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి, కథ- కథనం- సంగీతం- దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్..

Facebook Comments

About uma

Share

This website uses cookies.